Site icon Telangana Voice News

అసలేం జరిగింది ?

భారత్​–పాక్​ మధ్య కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు?

ఈ పరిణామాల చిక్కుముళ్లన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాక్​ చేతులెత్తేసింది.. తలొగ్గింది.. చైనా డబుల్​ గేమ్​ కు అమెరికా చెక్​ పెట్టింది. ఇంకా ఆలస్యం చేస్తే మట్టిలో కలిసిపోవడం ఖాయమని పాక్​ గ్రహించింది. కాల్పుల విరమణ వెనుక కొన్ని గంటల్లోనే అనేక పరిణామాలు ఇప్పుడు తెరముందుకు వస్తున్నాయి.

పొరబాటైనా.. అప్పుడే బ్రహ్మోస్​ శక్తి ప్రపంచానికి తెలిసింది..
పాక్​ భారత సరిహద్దుల్లో తీవ్ర ఉల్లంఘనలను భారత్​ తీవ్రంగా వ్యతిరేకించింది. పౌర ప్రాంతాలు, దేవాలయాలపై దాడులను తీవ్రంగా పరిగణించింది. అప్పటికే రెండు రోజుల నుంచి హెచ్చరికలను చేస్తున్నా పాక్​ పెడచెవిన పెట్టింది. దీంతో భారత్​ కు తిక్కరేగింది. బ్రహ్మోస్​ మిస్సైల్​ కు పని చెప్పింది. ఇంకేం పాక్​ కు చెందిన ఎయిర్​ బేస్​ లపై బ్రహ్మోస్​ విరుచుకుపడింది. ఒక్కసారి ప్రయోగిస్తే లక్ష్యాన్ని నాశనం చేసే  వరకూ దీన్ని ఆపేవారు ఉండరన్నది జగమెరిగిన సత్యం. 2022 మార్చి 9న భారత్​ అంబాల ఎయిర్​ బేస్​ నుంచి పొరపాటును ఈ మిస్సైల్​ ప్రయోగంలో తప్పిదం జరిగింది. నేరుగా 160కి.మీ. దూరంలో ఉన్న పాకిస్థాన్​ పంజాబ్​ లోని మియాన్​ చన్ను ప్రాంతంలో పడింది. దీంతో పాక్​ లో హాహాకారాలు చోటు చేసుకున్నాయి. అసలు ఈ మిస్సైల్​ ఒకటి వారి భూభాగంలోకి వచ్చినట్లుగా బ్రహ్మోస్​ పేలే వరకూ కూడా వారికి తెలియదు. పేలాక గానీ దీని పవర్​ పాక్​ కు అర్థం కాలేదు. పాక్​ నిఘా వ్యవస్థ, రాడార్లు, సాంకేతిక వ్యవస్థలు బ్రహ్మోస్​ ఉల్లంఘనలను గుర్తించలేకపోయాయి. అటుపిమ్మట భారత్​ ఇది పొరపాటే అని ఒప్పుకుంది. పాక్​ కావాలనే చేశారంది. చైనా దర్యాప్తు కోరింది. అమెరికా పొరపాటు జరిగిందని భారత్​ ఒప్పుకుంది కాబట్టి దీనిపై అనుమానాలు, అపోహలు అనవసరమని పేర్కొంది.

ఆర్మీ క్యాంపులే లక్ష్యం.. అమెరికా కాళ్లు పట్టుకున్న పాక్​..
సరిగ్గా ఇదే రీతిలో పాక్​ లోని నాలుగు ఎయిర్​ బేస్​ లు, రాడార్లు ధ్వంసం అయ్యాక పాక్​ లోని ఐదు ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్​ ను సాగనంపేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలోనే అమెరికా నుంచి భారత్​ కు ఫోనొచ్చింది. కాల్పుల విరమణ ప్రకటించాలని భారత్​ ను కోరింది. భారత్​ తన అనుమానాలను నివృత్తి చేసుకొని ఇందుకు అంగీకరించింది. అయితే బ్​రహ్మోస్​ ను పాక్​ కు సాగనంపే సమయంలో ఏం జరిగింది. బ్రహ్మోస్​ తో ఎయిర్​ బేస్​ ల ధ్వంసం తరువాత పాక్​ లో వణుకు పుట్టింది. వెంటనే ప్రధాని అధ్యక్షతన త్రివిధ దళాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అమెరికా, యూఎన్​, సౌదీ, యూరోపియన్​ యూనియన్​ దేశాలతో బ్రహ్మోస్​ వదలడంపై మొరపెట్టుకొని యుద్ధాన్ని ఆపించండి మహాప్రభో అని ఆయా దేశాలు, ముఖ్యంగా ట్రంప్​ కాళ్లా వేళ్లా పడింది. ట్రంప్​ ఇందుకు అంగీకరించలేదు. పహల్గామ్​ అమాయకుల దాడి, ఉగ్రఫ్యాక్టరీలపై పాక్​ తో కొద్దిసేపు చెడుగుడు ఆడాడు. అనంతరం ముందుకు మీరు నేరుగా భారత్​ డీజీఎంవోతో మాట్లాడాలని, ఆ తరువాత తాను సంభాషిస్తానని చెప్పారు. వెంటనే పాక్​ డీజీఎంఓ సాహిర్​ శంషాద్​ మీర్జా భారత్​ డీజీఎంఓ రాజీవ్​ ఘై తో నేరుగా సంభాషించారు. కాల్పుల విరమణ కోరారు. నమ్మకంగా జరిగిన విషయం అంతా చెప్పారు. భారత్​ డీజీఎంఓ తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అలా జరిగితే ఓకే అని చెప్పారు. ఈ లోపు అమెరికా భారత్​ కు ఫోన్​ చేసి జరిగిన విషయం అంతా చెప్పి సాయంత్రం 5 గంటలకు ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించాలని, ఇరుదేశాల మధ్య శాంతి వెల్లివిరియాలని కోరింది. ఇందుకు భారత్​ అంగీకరించింది. వెంటనే విలేఖరుల సమావేశంలో కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో వెంటనే మరోమారు పాక్​ ట్రంప్​ కు ఫోన్​ చేసి రక్షించావు దేవుడా అని మొరపెట్టుకొని ఆకాశానికెత్తేసింది. మీడియా ప్రకటనలో కూడా మాటిమాటికి ట్రంప్​ కు కృతజ్ఞతలు తెలిపింది. 

చైనా ఆటంకాలు..కాల్పుల ఉల్లంఘన ఎందుకు జరిగింది..
పాక్​ కు వెంటనే చైనా ఫోన్​ చేసింది. తాము మీ ప్రాంతంలో ఇంతపెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టామని, ఆయుధాలను అందించామని, ఆ ప్రాజెక్టుల్లో తమ జాతీయులు అనేకమంది ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఇంతచేసినా యుద్ధ విరమణకు ట్రంప్​ కు కృతజ్ఞతలు ఎలా చెబుతారని నిలదీసింది. వెంటనే కాల్పులను ప్రారంభించాలని తాము వెంటే ఉన్నామని రెచ్చగొట్టింది. అదే సమయంలో ఓ అరగంట, గంటపాటు ఆగిన కాల్పులు కాస్త మళ్లీ పాక్​ మొదలుపెట్టింది. ఆసియా దేశంలో తామే పెద్దన్న అని ఏదైనా చూసుకుందామని చైనా బీరాలుపోతూ పాక్​ ను కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ప్రోత్సహించింది. 

తెరవెనుక తతంగం..
పాక్​ ఉల్లంఘనలను భారత్​ తిప్పికొడుతూనే మరోవైపు తాము విరమణ ఉల్లంఘనలకు సిద్ధమేనని ప్రకటించింది. ఈ లోపు ఇటు భారత్ నుంచి అమెరికాకు ఈ సమాచారం మొత్తం అందింది. అటుపిమ్మట ట్రంప్​ ఫోన్​ చేసి ఇటు పాక్​ ను, అటు చైనాను గట్టిగానే తలంటారు. దీంతో పాక్​ వెనక్కు తగ్గింది. తెరవెనుక జరిగిన తతంగం. 

Exit mobile version