Category: National News
-
చాయ్ తాగినంత సమయంలో పనిముగించేస్తాం
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు.. ట్రైలర్ మాత్రమే చూపించాం.. ఇంకా సినిమా మిగిలే ఉంది.. పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉగ్రశిబిరాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి చాయ్ తాగినంత సమయంలోనే పనిముగించేస్తాం జాగ్రత్తా అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ ను హెచ్చరించారు. శుక్రవారం గుజరాత్ లోని భుజ్ ఎయిర్ బేస్ ను మంత్రి సందర్శించారు. జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడం హర్షణీయమన్నారు. భద్రతాదళాల మధ్య…
-
ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు
పహల్గామ్ దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ లోని పౌర సమాజానికి నష్టం వాటిల్లకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్ట్ నెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అదే సమయంలో పాక్ సరిహద్దులోని భారత పౌరులను, దేవాలయాలను, ప్రార్థనాలయాలను టార్గెట్ చేసుకుందని చెప్పారు. తాము యుద్ధనీతిని ప్రదర్శించామని, పాక్ ఈ నీతిని విస్మరించిందన్నారు. దీంతో పాక్ లోని…
-
బుల్లెట్ పేలిస్తే.. బాంబు పేలుస్తాం
పాక్ వైపు నుంచి బుల్లెట్ పేలితే (దూసుకొస్తే).. భారత్ వైపు నుంచి బాంబు పేలుతుందని (దూసుకొస్తుందని) ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఐబీ, రా అధిపతులు పాల్గొన్నారు. జీరో టోలరెన్స్ విధానంతోనే వ్యవహరిస్తాం..కాగా ప్రధానమంత్రి…
-
అసలేం జరిగింది ?
భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు? ఈ పరిణామాల చిక్కుముళ్లన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాక్ చేతులెత్తేసింది.. తలొగ్గింది.. చైనా డబుల్ గేమ్ కు అమెరికా చెక్ పెట్టింది. ఇంకా ఆలస్యం చేస్తే మట్టిలో కలిసిపోవడం ఖాయమని పాక్ గ్రహించింది. కాల్పుల విరమణ వెనుక కొన్ని గంటల్లోనే అనేక పరిణామాలు ఇప్పుడు తెరముందుకు వస్తున్నాయి. పొరబాటైనా.. అప్పుడే బ్రహ్మోస్ శక్తి ప్రపంచానికి తెలిసింది..పాక్ భారత సరిహద్దుల్లో తీవ్ర ఉల్లంఘనలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. పౌర…
-
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం
ఏడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16న సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం జపాన్ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్లో పర్యటించిన అధికారులు వివిధ పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపి తెలంగాణలో రూ.12,062 కోట్లు పెట్టుబడి…
-
జమ్మూ & కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకుల కోసం హెల్ప్ డెస్క్
భారత ప్రభుత్వం జమ్మూ & కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, జిల్లా పరిపాలన పర్యాటకులకు సాయం మరియు సమయానికి సమాచారాన్ని అందించేందుకు 24/7 పర్యాటక హెల్ప్ డెస్క్ స్థాపించింది. ఈ కార్యక్రమం ఈ సంక్షోభ సమయంలో అన్ని సందర్శకులకు భద్రత, సంక్షేమం మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో సహాయపడుతుంది. అనంతనాగ్లోని కంట్రోల్ రూమ్ మరియు ఇతర హెల్ప్లైన్లు అత్యవసర పరిస్థితులు లేదా పర్యాటకుల ద్వారా వచ్చిన సాధారణ ప్రశ్నలను హ్యాండిల్ చేయడానికి 24/7 అందుబాటులో ఉన్నాయి. సహాయాన్ని…
-
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం (ఏప్రిల్ 23), బారాముల్లాలోని ఉరి సెక్టార్ సమీపంలో నియంత్రణ రేఖ వెంబడి భారతదేశంలోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఉగ్రవాదుల నుండి పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. OP టిక్కా, బారాముల్లా 23 ఏప్రిల్ 2025న, బారాముల్లాలోని ఉరి నాలా వద్ద ఉన్న సర్జీవన్ జనరల్ ఏరియా ద్వారా సుమారు 2-3 మంది UI ఉగ్రవాదులు చొరబడటానికి…
-
ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రధాని మోది
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన దారుణ సంఘటన మధ్య ఆయన జెడ్డా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోడీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద దాడిపై చర్చించడానికి ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్…
-
జమిలిపై నేడు పార్లమెంటరీ కమిటీ సమావేశం
జమిలిపై మరో ఎత్తుగడ ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ త్వరలో వెబ్సైట్ను ప్రారంభించనుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్సైట్ QR కోడ్ సౌకర్యంతో అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్ను అన్ని భారతీయ భాషలలో అందుబాటులోకి తీసుకురావడానికి కమిటీ కృషి చేస్తోంది.
-
PM Modi: మోడీ సౌదీ అరేబియాకు బయలుదేరారు
ప్రధాని మోదీ సౌదీ అరేబియాకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు బయలుదేరారు. సౌదీ అరేబియా ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోదీ సౌదీ అరేబియాకు వెళ్తున్నారు. ఆయన రెండు రోజుల పర్యటనలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. గత దశాబ్ద కాలంగా భారత్తో సౌదీ అరేబియా సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాలు మరోసారి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. మోదీ భారతీయులతో కూడా సంభాషించనున్నారు.