Site icon Telangana Voice News

బుల్లెట్​ పేలిస్తే.. బాంబు పేలుస్తాం

పాక్​ వైపు నుంచి బుల్లెట్​ పేలితే (దూసుకొస్తే).. భారత్​ వైపు నుంచి బాంబు పేలుతుందని (దూసుకొస్తుందని) ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని కళ్యాణ్​ మార్గ్​ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, ఐబీ, రా అధిపతులు  పాల్గొన్నారు. 

జీరో టోలరెన్స్​ విధానంతోనే వ్యవహరిస్తాం..
కాగా ప్రధానమంత్రి సమావేశంలో కీలకమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉగ్రవాదంపై ఒకటే విధానమన్నారు. జీరో టోలరెన్స్​ విధానంతోనే వ్యవహరిస్తామన్నారు. సింధు జలాల ఒప్పందంపై మాట్లాడేదే లేదన్నారు. పీవోకేను ముందుగా, మర్యాదగా భారత్​ కిచ్చేయాలన్నారు. పాక్​ కబ్జా చేసింది నిజం కాదా అని నిలదీశారు. భారత్​–పాక్​ చర్చల్లో మూడోదేశ మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. పాక్​ ఏదైనా దుందుడుకు చర్యలకు దిగితే మరోమారు సమాధానం ఇంతకంటే కఠినంగానే ఇస్తామని చెప్పారు. ఇప్పటికే త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. 

స్వీయరక్షణ కాదు.. ఎదురుదాడే..
భారత్​ ఇప్పుడు స్వీయ రక్షణ విధానాన్ని గాకుండా ఎదురుదాడి (దూకుడు) విధానానికి దిగుతుందని స్పష్టం చేశారు.  పాత పద్ధతులు, విధానాలు, ఒప్పందాలు ఇకపై చెల్లవన్నారు. ఇదే అంశాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​ తో కూడా చెప్పినట్లు సమాచారం. ఓవైపు కాల్పుల విరమణ ప్రకటించాక తిరిగి పాక్​ దాడులు చేయడం వెనుక ఆ దేశం దుర్భుద్ధి, దుర్నితీ, ఉగ్రభావజాలాన్ని తెలియజేస్తుందన్నారు. ఇక వీటన్నింటినీ సహించేశక్తి, ఓపిక భారత్​ కు, ప్రజలకు లేవన్నారు. చర్యకు బదులుగా ప్రతీచర్య విధానాన్నే అనుసరిస్తామని కుండబద్ధలు కొట్టారు. 

పీవోకే ఇవ్వకుంటే రాజీ సాధ్యం కాదు..
పీవోకే విషయం సమస్య పరిష్కారం కాకుంటే ఎటువంటి సంభాషణలు, సయోధ్య, రాజీ సాధ్యం కాదన్నారు. ఆపరేషన్​ సిందూర్​ ద్వారా ఉగ్రవాదానికి, ప్రోత్సహిస్తున్న దేశానికి బలమైన సందేశాన్నిచ్చామని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తమదేశంపై ఉసిగొలిపే వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని మోదీ స్పష్టం చేశారు.

Exit mobile version