ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు.. ట్రైలర్ మాత్రమే చూపించాం.. ఇంకా సినిమా మిగిలే ఉంది.. పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉగ్రశిబిరాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి చాయ్ తాగినంత సమయంలోనే పనిముగించేస్తాం జాగ్రత్తా అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ ను హెచ్చరించారు. శుక్రవారం గుజరాత్ లోని భుజ్ ఎయిర్ బేస్ ను మంత్రి సందర్శించారు. జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడం హర్షణీయమన్నారు. భద్రతాదళాల మధ్య సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. పాక్ గడ్డపై డ్రాగన్ కుయుక్తులను కూడా తిప్పికొట్టామని మంత్రి చెప్పారు. పాక్ వద్ద అణ్వాయుధాలుండడం భారత్ కే కాదు, ప్రపంచదేశాలకు కూడా ముప్పేనని చెప్పారు. కాగితపు దుస్తులు వేసుకున్న పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడడం మానేయాలన్నారు.
త్రివిధ దళాల శౌర్యం వెర్మిలియన్ అని చూపించింది. ఇది అలంకారానికి కాదు, ధైర్యానికి చిహ్నాం అని కొనియాడారు. వెర్మిలియన్ అనేది ఉగ్రవాదం నుదిటిపై భారతదేశం గీసిన ప్రమాదపు ఎర్రటి గీత అని అన్నారు. . ఈ పోరాటంలో ప్రభుత్వం, పౌరులందరూ ఐక్యంగా ఉన్నారని తెలిపారు. తాము శాంతి కోసం మా హృదయాలను తెరిచి ఉంచాం. శాంతికి భంగం కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరాటం కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదని, దేశ రక్షణలో ఒక భాగమని అన్నారు. భారత్ మునుపటిలా లేదన్నారు. శ్రీరామున్ని మార్గాన్ని అనుసరిస్తూ రాక్షసుల్ని నిర్మించే భారత్ నిరూపించుకుంటున్నామని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో మరోమారు పాక్ ఉగ్ర మౌలిక సదుపాయాల నిర్మాణంలో నిమగ్నమై ఉందన్నారు. అజార్ కు రూ. 14 కోట్లు ఇవ్వనుందని చెప్పారు. ఐఎంఎఫ్ నుంచి తీసుకువచ్చిన డబ్బును ఉగ్ర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగిస్తుందని చెప్పారు. ఐఎంఎఫ్ పాక్ కు నిధులు ఇవ్వడం మానేయలని అన్నారు. లేకుంటే ఐఎంఎఫ్ నిధులను నేరుగా ఉగ్రవాదుల జేబుల్లోకి వెళ్లి సామాన్య ప్రజలపై దాడులకు వినియోగిస్తారని రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మోస్ తో పగటిపూటనే పాక్ కు నక్షత్రాలను చూపెట్టామని ఎద్దెవా చేశారు. ఆర్డీడీవో, ఆకాశ్, ఇతర రాడార్ వ్యవస్థలు ప్రశంసలు పొందుతున్నాయని తెలిపారు. భారత వైమానిక దళం పాక్ లోని ప్రతీమూలకు చేరుకోవడం సామాన్య, చిన్న విషయం ఏమీ కాదన్నారు. సరిహద్దును తాకకుండానే 9 ఉగ్రవాద స్థావరాలను ఎలానాశనం చేశామో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. వైమానిక స్థావరాలు, రాడార్ సాంకేతికత, యుద్ధ విమానాలను కూడా భారత దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. ఈ ఆయుధ సంపత్తి భారతదేశ బలాన్ని మరింత పెంచుతుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.