Site icon Telangana Voice News

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ఏప్రిల్ 12 ( హనుమాన్ జయంతి) న లోకమాత అహిల్యా బాయి 300 వ జయంతి సందర్భంగా TTC భవన్ లో జరిగిన కుటుంబ సమ్మేళనం అందరికీ స్ఫూర్తి నిచ్చింది.

సాయంత్రం 6.30 లకు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు హనుమాన్ చాలీసా, భజన, పద్య,శ్లోక పఠనం,తెలుగు మాసాలు, నక్షత్రాలు, సంవత్సరాల పేర్లు, భగవద్గీత శ్లోకాలను చదివి వినిపించారు.
యోగ కార్యక్రమం, అహిల్యబాయి హోల్కర్ ఏక పాత్ర నిర్వహించారు.
అహిల్యా బాయి హోల్కర్ కథ చెప్పి,దాని ఆధారంగా క్విజ్ పోటీ నిర్వహించారు.
జిల్లా అధ్యక్షులు డా అరవింద్ గారు కుటుంబ సభ్యులు అప్పుడుప్పుడు కలుస్తూ ఉండాలని పేర్కొన్నారు.

మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ శ్రీమతి అహిల్యా బాయి హోల్కర్ జీవిత ఘట్టాలు వివరించింది.

” * మహారాష్ట్ర లో చౌండి అను గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించి,అమ్మా నాన్నల నుండి వినయ విధేయతలు నేర్చింది.

రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ తన ప్రసంగంలో కుటుంబ ప్రాధాన్యత గురించి వివరించారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి బల్ల సంతోష్,ఉపాధ్యక్షులు విజయ భాస్కర్,రాజ శేఖర్ రెడ్డి,కార్యదర్శులు బాలయ్య, మాట్ల సుమన్,కన్వీనర్ మాలే రమేష్,తపస్ సభ్యులు రఘువర్ధన్ రెడ్డి,శ్రీకాంత్,మధుసూదన్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి,వేణు మాధవ్,బాలకృష్ణ రెడ్డి,నరేష్, ఉమాశంకర్, వెన్నెల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version