Category: Districts
-
టీ.ఎస్.పీ.ఎస్.సి.కి రూ.40 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కమిషన్ కార్యాలయ నిర్వహణ, పరీక్షల ఏర్పాటుకు కావాల్సిన రూ.40 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఆఖరులోపు 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ కు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు కవితను నిందితురాలిగా సిబిఐ గుర్తింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా చేరుస్తూ ఈనెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయడం, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. గత సంవత్సరం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, CBI నిందితురాలుగా చేర్చడంతో ఎమ్మెల్సీ కవిత ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చు అని వదంతులు వ్యాపిస్తున్నాయి..
-
ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..
బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు ఉదయం రోడు ప్రమాదంలో మరణించారు. మొన్నటికి మొన్న, నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది.. ఎమ్మెల్యే గా లాస్యకు కలిసిరాని కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే.. ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది..…
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు
అణచివేతకు గురైన కులాలవారు రాజకీయంగా ఎదగడం, అణచివేతకు గురైన స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉండటం, యువత చట్టసభల్లో ప్రవేశించడం, ఇవన్నీ సమాజాన్ని అభ్యుదయంవైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. దళితబిడ్డగా, స్త్రీగా, యువతకు ప్రతినిధిగా చట్టసభల్లో బలమైన గొంతును వినిపించాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో సక్సస్ అయి, మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన లాస్య నందితకు ఇలా జరగడం ఆమె కుటుంబానికే కాదు,…
-
మరో రెండు గ్యారంటీల అమలు
గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు.. 27 లేదా 29వ తేదీన ప్రారంభం.. గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…
-
గొర్రెల స్కామ్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ
గొర్రెల స్కామ్ కేసులో ఇద్దరు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్, డిస్టిక్ గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ.. గొర్రెల స్కామ్ కేసులో ఏ5గా ఉన్న రఘుపతి రెడ్డి – డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్, ధర్మపురి రవి – కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్, A4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, A6 గణేష్…
-
సమ్మక్క గద్దె వద్ద నున్న భారీ రావి వృక్షం ఎలా మాయమైంది
మేడారంలోని సమ్మక్క గద్దె వద్ద భారీ రావి వృక్షం ఉండేది. ఎత్తైన ఈ వృక్షం సమ్మక్క గద్దె ను ఆనుకొని ఉండడంతో చల్లటి నీడ ఇచ్చేది. 2012 వరకు కూడా ఉండే ఈ రావి చెట్టు, దీనినే రేలా చెట్టుగా స్థానికంగా పిలిచేవారు. అయితే,, సమ్మక్క సారలమ్మలు గద్దెలపై వచ్చిన మరుసటి రోజు, జాతర మూడో రోజు, ఈ రావి చెట్టుపై ఒక నాగుపాము ప్రత్యక్షమై, కొద్ది సేపటితర్వాత మాయం అయిపోయేదని స్థానిక ఆదివాసీలు చెప్పేవారు. అయితే,…
-
సిగ్నల్స్ బంద్.. ప్రయాణికులకు ఇబ్బంది
ప్రయాణికుల సౌకర్యార్థం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో జనగామ పట్టణ కేంద్రంలో ట్రాపిక్ నియంత్రణ కోసం ఏర్పాటుచేసిన సిగ్నల్స్ ప్రస్తుతం పనిచేయక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారనీ. ఇష్టారాజ్యంగా ప్రయాణం చేయడం వల్ల ప్రయాణికులు పలు ప్రమాదాలకు గురికాకముందే వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి గత నాలుగు రోజులుగా జనగామ చౌరస్తాలో సిగ్నల్స్ పని చేయకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురైతున్నారనీ మేడారం జాతర ఉన్నందున ప్రజలు ఎక్కువ…
-
మేడారం మహాజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్
ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు మేడారం మహా జాతర నేపథ్యంలో నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 23న మేడారం సమ్మక్క సారలమ్మ స్టేట్ ఫెస్టివల్ గా నిర్ణయించడం జరిగిందందున జిల్లా మొత్తం సెలవు ప్రకటించారు. ఈనెల 21, 22, 24న ఏజెన్సీ మండలాలకు లోకల్ హాలిడేస్ గా ప్రకటించారు. ఈ నాలుగు రోజులపాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. అయితే 23 రోజు రోజున సెలవు రోజుగా ప్రకటించి…
-
మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను దర్శించుకున్న పొంగులేటి, సీతక్క
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి సీతక్కలు మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను వారు దర్శించుకున్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని సమాచార, రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్కలు అన్నారు. అనంతరం ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందన్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ కొలువైన రాష్ట్రంగా ఉండడం మనందరికీ…